దేశంలో కొత్త‌గా 46,951 క‌రోనా కేసులు..

203
corona
- Advertisement -

దేశంలో కొత్త‌ క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా పెరిగిన కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… గ‌త‌ 24 గంట‌ల్లో 46,951 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా 21,180 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 212 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,967 కు పెరిగింది.

ఇక దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,46,081కు చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,51,468 మంది కోలుకున్నారు. 3,34,646 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,50,65,998 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -