రాష్ట్రంలో కొత్త‌గా 337 కరోనా కేసులు నమోదు..

298
corona in ts
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కొత్త‌గా 337 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 181 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,826 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,671గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,958 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,226 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 91 మందికి క‌రోనా సోకింది.

- Advertisement -