దేశంలో కొత్త‌గా 2,40,842 కరోనా కేసలు నమోదు..

233
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా దేశవ్యాప్త కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నా.. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా మరణాలు మూడులక్షలకు చేరువయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మొన్నటి వరకూ రోజుకు 4 లక్షలకుపైగా నమోదవగా.. ప్రస్తుతం మూడు లక్షలకు దిగువకు చేరాయి. గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,40,842 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న 3,55,102 మంది కోలుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,30,132కు చేరింది. మరో 3,741 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,99,266కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,34,25,467 మంది కోలుకున్నారు. 28,05,399 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,50,04,184 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,86,07,937 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 21,23,782 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

- Advertisement -