దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు..

162
corona
- Advertisement -

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,596 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 166 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,89,694 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3.40 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 3.34 కోట్ల మంది కోలుకున్నారు.ఇప్పటి వరకు 4,52,290 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. పండుగల కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త నెమ్మదించింది. నిన్న కేవలం 12,05,162 మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.12 శాతంగా ఉంది.

- Advertisement -