మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలి: సీఎం కేసీఆర్‌

295
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదని స్పష్టం చేశారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, అన్ని పనులు చేసుకుందామని పేర్కొన్నారు. రోజుకు 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. విపక్షాలకు దిమ్మదిరిగే రీతిలో వరంగల్ ప్రజాగర్జన సభ ఉండాలని టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని కేసీఆర్‌ సూచించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పందిస్తూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26న గానీ, లేక 27న గానీ హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఈ నెల 25 తర్వాత హుజూరాబాద్‌లో ఎన్నికల సభ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.. ఇక ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీకి 6,500 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -