దేశంలో కొత్త‌గా 12,923 మందికి కరోనా..

187
corona
- Advertisement -

దేశంలో గత 24 గంటల్లో 12,923 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,08,71,294 కు చేరింది. అదే స‌మ‌యంలో 11,764 మంది కోలుకున్నారు. తాజాగా దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,360 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,73,372 మంది కోలుకున్నారు. 1,42,562 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 70,17,114 మందికి వ్యాక్సిన్ వేశారు.కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,40,23,840 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -