దేశంలో కొత్త‌గా 11,499 కరోనా కేసులు..

109
- Advertisement -

ఇండియాలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టింది. దేశంలో కొత్త‌గా 11,499 కరోనా కేసులు న‌మోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 23,598 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల‌ 255 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,21,881 మంది చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 4,22,70,482గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 5,13,481కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 177,17,68,379 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు ఇచ్చారు.

- Advertisement -