దేశంలో కొత్తగా 1.65 లక్షల కరోనా కేసులు నమోదు..

201
corona
- Advertisement -

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. వరుసగా మూడు రోజు రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తుండగా.. పెద్ద ఎత్తున బాధితులు కోలుకోవడం కాస్త ఊరట కలిగిస్తున్నది. నిన్న 1,65,553 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం… నిన్న 2,76,309 మంది కోలుకున్నారు.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,94,800కు చేరింది. మరో 3,460 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,25,972 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,54,54,320 మంది కోలుకున్నారు. 21,14,508 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,20,66,614 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -