దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

196
omicron
- Advertisement -

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24గంటల్లో దేశంలో 6351 కరోనా కేసులు నమోదుకాగా 315 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 75 వేల 841గా ఉంది.ఇప్పటివరకు కరోనాతో నాలుగు లక్షల 79 వేల 997 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3 కోట్ల 42 లక్షల 37 వేల 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో మొత్తం 578కి చేరుకున్నాయి. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో ఢిల్లీ ఉండగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్ 43, తెలంగాణలో 41, తమిళనాడు 34, కర్ణాటకలో 31 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు భారత్‌లో ఒమిక్రాన్ నుంచి 151 మంది కోలుకున్నారు.

- Advertisement -