నూతన పార్లమెంట్ ప్రత్యేకతలివే..

34
- Advertisement -

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ నూతన పార్లమెంటు భవనాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనంను టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్ నిర్మిస్తోంది. పెద్ద హాళ్లు లైబ్రరీ విశాలమైన పార్కింగ్‌ స్థలం మరియు కమిటీ గదులు ఉన్నాయి. కొత్త పార్లమెంట్‌ భవనంలో 888సీట్ల కెపాసిటీతో లోక్‌సభ హాల్‌ 384మంది సభ్యులు ఉండే విధంగా రాజ్యసభ హాళ్లు నిర్మించారు. రాజ్య సభ హాల్‌ను లోటస్ థీమ్‌ తరహాలో నిర్మించారు.

రూ.971 కోట్లతో సెంట్రల్ విస్టా నిర్మాణం జరిగింది. 1244 ఎంపీల‌కు అనువైన రీతిలో సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. 64,500 మీట‌ర్ల విస్తీర్ణంలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం నిర్మించగా భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం జరిగింది.

Also Read: శ్రీముఖి వాదన భలే ఉందే !

కొత్త పార్లమెంటుకు జాతీయ గీతంతో పట్టాభిషేకం చేయనున్నారు మరియు దాని పైకప్పులో రాష్ట్రపతి భవన్‌లో ఉన్నటువంటి సంప్రదాయ-శైలి కార్పెటింగ్ మరియు ఫ్రెస్కో పెయింటింగ్‌లు ఉంటాయి, లోక్సభ లోక్సభ పైకప్పు నిర్మాణం పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో ఉంటుంది.  అంతేకాకుండా రాజ్యసభ పైకప్పు విరబూసిన కమళం రూపంలో ఉంటుంది.

కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభలో 888 మంది సభ్యులు కూర్చునే ఏర్పాటు ఉంటుంది. భారతదేశంలో ప్రస్తుతం లోక్‌సభలో 543 సీట్లు ఉన్నాయి.అదేవిధంగా, కొత్త పార్లమెంట్ హౌస్‌లో ప్రస్తుతం 245 స్థానాలు ఉన్న రాజ్యసభలో 384 మంది సభ్యులకు స్థానం కల్పించవచ్చు. కొత్త పార్లమెంట్ హౌస్‌లో ఉభయ సభల ఉమ్మడి అసెంబ్లీని పిలిచినప్పుడు దాని కోసం నియమించబడిన గదిలో 1,272 మందికి సీట్లు ఉంటాయి.

Also Read:CMKCR:మోదీ ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నారు

ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన HCPడిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని రూపొందించింది.

- Advertisement -