దేశంలో కొత్తగా 14,146 క‌రోనా కేసులు..

211
- Advertisement -

దేశంలో కొత్తగా 14,146 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా సోకినవారి సంఖ్య 3,40,67,719కు చేరింది. ఇందులో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల నిన్న‌ 144 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,52,124 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 41,20,772 డోసుల‌ క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 97,65,89,540కు చేరింది. రాష్ట్రాలకు ఇప్పటివరకు 101.7 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశామని పేర్కొంది. అందులో 10.42 కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

- Advertisement -