దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు…

55
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 20,557 కరోనా కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 4,38,03,619కి చేరాయి. ప్రస్తుతం దేశంలో 1,45,654 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 5,25,785 మంది మృతిచెందారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి చేరగా 200.61 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.33 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.

- Advertisement -