- Advertisement -
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ 200 కోట్లు దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ప్రశంసలు గుప్పించారు. భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మేము భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాం. దానితో పాటు కరోనా ప్రభావాన్ని తగ్గిస్తున్నందుకు కృతజ్ఞతలు అని బిల్గేట్స్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోసులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. కాగా, దేశంలో గత ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 100 కోట్ల డోసులను వేయడానికి కేవలం 9 నెలల సమయం పట్టింది. అలాగే, మరో 9 నెలల్లో 200 కోట్ల డోసులను వేశారు.
- Advertisement -