20 వేలు దాటిన కరోనా కేసులు..

31
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 20,139 కరోనా కేసులు నమోదుకాగా 38 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,36,89,989కి చేరగా 4,30,28,356 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,36,076 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 5,25,557 మంది మృతిచెందారు.

రోజువారి పాజిటివిటీ రేటు 5.10 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -