దేశంలో 24 గంటల్లో 12,408 కరోనా కేసులు..

155
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 12,408 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 120 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,51,460 యాక్టివ్ కేసులుండగా 1,04,96,308 మంది కరోనా నుండి కోలుకున్నారు. 1,54,823 మంది ఇప్పటివరకు కరోనాతో మృతి చెందారు. టీకాడ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 49,59,445 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక దేశంలో మొత్తం 19,99,31,795 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

- Advertisement -