8 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

184
corona
- Advertisement -

దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. రోజుకి 25 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరికి ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,506 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,93,802కు చేరగా ఇప్పటివరకు 21,604 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో 2,76,685 యాక్టివ్ కేసులు ఉండగా 4,95,513 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 475 మంది మృతి చెందారు.

ఇక మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ అత్యధికంగా 2,30,599 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 9667 మంది మరణించారు. తమిళనాడులో 1,26,581 మంది కరోనా బారినపడగా, 1,765 మంది బాధితులు మృతిచెందారు.

- Advertisement -