8 లక్షలు దాటిన కరోనా కేసులు..

209
corona
- Advertisement -

దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపొతూనే ఉంది. గత 24 గంటల్లో 27,114 పాజిటివ్ కేసులు నమోదుకాగా 519 మంది కరోనాతో మృతిచెందారు.

ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 8,20,916కి కరోనా కేసుల సంఖ్య చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. ఇప్పటివరకు 22,123 మంది కరోనాతో మృతిచెందారు.

ప్రస్తుతం 2,83,407 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.. 5,15,385 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -