24 గంటల్లో 20,903 కరోనా కేసులు…..379 మంది మృతి

190
india coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రోజుకు దాదాపు 20 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో ఏకంగా 20930 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

ఇక దేశంలో ఇప్పటివరకు 6,25,544 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 2,27,439 యాక్టివ్‌ పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరో 3,79,892 మంది కరోనా నుండి కొలుకోగా మొత్తం ఇప్పటివరకు 18,213 మంది మృతిచెందారు.

దేశవ్యాప్తంగా గురువారం 2,41,576 మంది పరీక్షలు చేశామని …. జూలై 2 వరకు మొత్తం 92,97,749 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది ఐసీఎంఆర్.

- Advertisement -