ఒక్కరోజే 9985 కరోనా కేసులు…279 మంది మృతి

228
coronavirus india
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూను ఉంది. గత 24 గంటల్లో 9985 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒక్కరోజే 279 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు 276583 పాజిటివ్ కేసులు నమోదుకాగా 7745 మంది మృత్యువాత పడ్డారు.

దేశంలో 133632 యాక్టివ్‌ కేసులు ఉండగా 135206 కేసులు రికవర్‌ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. యాక్టివ్‌గా ఉన్న కేసుల కన్నా.. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విషయంలో ఐదో స్థానంలో ఉంది. ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే దేశాలు కొనసాగుతున్నాయి. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదుకాగా తమిళనాడులో కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృత్యువాత పడ్డారు.

- Advertisement -