దేశంలో ఒక్కరోజే 62 వేల కేసులు నమోదు..

161
india coronavirus
- Advertisement -

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. నిన్నటివరకు రోజుకు 55 వేలకు పైగా కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో ఏకంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేలు దాటాయి.

24 గంట‌ల్లో 62,538 మంది పాజిటివ్ కేసులు నమోదుకాగా 886 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 20,27,075 పాజిటివ్ కేసులు నమోదుకాగా 6,07,384 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 13,78,106 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు దేశంలో క‌రోనాతో 41,585 మంది మృత్యువాతపడ్డారు.

ఇప్పటివరకు 2,27,24,134 కరోనా టెస్టులు చేయగా గత 24 గంటల్లో 5,74,783 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -