దేశంలో 24 గంటల్లో 16,838 కరోనా కేసులు..

383
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 16,838 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 113 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,73,761కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,17,319 యాక్టివ్ కేసులుండగా 1,08,39,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,57,548కు చేరాయి. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 1,80,05,503 మందికి వ్యాక్సిన్‌ వేయగా ఇప్పటి వరకు 21,99,40,742 నమూనాలను పరిశీలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -