దేశంలో 24 గంటల్లో 11,067 కరోనా కేసులు..

125
corona
- Advertisement -

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతూనే ఉంది. గత 24గంటల్లో కొత్తగా 11,067 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 94 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,58,371కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,41,511 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,05,61,608 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో 1,55,252 మంది మృతిచెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 66,11,561 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఇప్పటి వరకు 20,33,24,655 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు చెప్పింది.

- Advertisement -