భగ్గుమన్న పెట్రోల్ ధరలు…

176
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. నిన్న లీటర్ పెట్రోల్‌, డిజిల్‌పై 35 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 30 పైసలమేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ఈ ఏడాది ఇప్పటివరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.89, లీటరు డీజిల్‌పై రూ.3.91 పెరిగింది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.09గా ఉండగా, డీజిల్‌ ధర రూ.84.79కి చేరగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.60కి చేరింది. అదేవిధంగా డీజిల్‌ ధర రూ.77.73కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ ధర రూ.94.12, డీజిల్‌ రూ.84.63కి చేరాయి. ఇక బెంగళూరు- పెట్రోల్‌ రూ.90.53, డీజిల్‌ రూ.82.40గా ఉంది.

- Advertisement -