దేశంలో 24 గంటల్లో 11,831 కరోనా కేసులు..

147
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 11,831 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 84 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,48,609 యాక్టివ్ కేసులుండగా 1,05,34,505 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,55,080 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 58,12,362 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది. నిన్నటివరకు 20,19,00,614 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది.

- Advertisement -