దేశంలో 24 గంటల్లో 66,732 కరోనా కేసులు…

177
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 66,732 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 816 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 8,61,853 యాక్టివ్ కేసులుండగా 61,49,536 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు కరోనాతో 1,09,150 మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో 9,94,851 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటివరకు 8,78,72,093 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -