దేశంలో 24 గంటల్లో 12,881 కరోనా కేసులు..

124
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 12,881 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 101 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,09,50,201కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 1,37,342 యాక్టివ్ కేసులుండగా 1,06,56,845 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 1,56,014కు చేరింది. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 94,22,228 వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పింది.

- Advertisement -