దేశంలో 27 లక్షలుదాటిన కరోనా కేసులు..

224
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 60 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు దాటింది.

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 55,079 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 876 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,02,743కు చేరగా 51,797 మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం దేశంలో 6,73,166 యాక్టివ్‌ కేసుండగా 19,77,780 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 8,99,864 పరీక్షలు చేశామని ఇప్పటివరకు 3,09,41,264 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

- Advertisement -