150 పరుగులకే విండీస్ ఆలౌట్..

36
- Advertisement -

వెండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు భారత బౌలర్లు విజృంభించారు. భారత స్పిన్ మాయాజాలానికి విండీస్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు.దీంతో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది వెస్టిండీస్. అథనేజ్ (47) మినహా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేక పోయారు. భారత్ బౌలర్లు రవిచంద్ర అశ్విన్ ఐదు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు.

అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. రోహిత్, జైస్వాల్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి రోహిత్ శర్మ (30 నాటౌట్), యశస్వీ జైస్వాల్ (40 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

Also Read:మాంగోస్టిన్ పండుతో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -