మా ఊర్లో కాంగ్రెస్‌కు ప్రవేశం లేదు..!

40
- Advertisement -

ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతుండగా కాంగ్రెస్ నేతల మాటలు రైతుల పాలిట శాపంగా మారాయి.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రేవంత్ దిష్టిబొమ్మలు దగ్దం చేయగా తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదు అంటూ పలు గ్రామాల్లో ఆయా గ్రామాల్లో రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామా ల్లో బుధవారం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి.

కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద కరీంనగర్‌-సిరిసిల్ల ప్రధాన రహదారిపై స్థానిక రైతులు ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో బద్దిపల్లి, బావుపేట, ఖాజీపూర్‌ గ్రామాల్లో, ఇటు కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌, ఎలగందుల తదితర గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Also Read:ఈ అద్బుతమైన ఆరోగ్య చిట్కాలు..తెలుసా?

- Advertisement -