ఐర్లాండ్‌తో మూడో టీ20..భారీ మార్పులతో!

39
- Advertisement -

ఇవాళ ఐర్లాండ్‌తో మూడో టీ20 జరగనుండగా భారత్‌ భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికూ మూడు టీ20 సిరీస్‌ను భారత్‌ దక్కించుకోగా నామమాత్రమైన మూడో టీ20 ఇవాళ జరగనుంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వనుంది టీమిండియా.

వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ, పేసర్‌ అవేశ్‌ ఖాన్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ల ఈ మ్యాచ్‌లో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ బ్యాటర్లకు అనుకూలించవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 175 పరుగులు చేస్తే విజయావకాశాలు సాధించే అవకాశాలు ఎక్కువ.

భారత్‌ జట్టు అంచనా:

జైస్వాల్‌, రుతురాజ్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, శాంసన్‌/జితేశ్‌, దూబే, సుందర్‌/షాబాజ్‌, అర్ష్‌దీప్‌/అవేశ్‌, బిష్ణోయ్‌, బుమ్రా (కెప్టెన్‌), ప్రసిద్ధ్‌ క్రిష్ణ.

ఐర్లాండ్‌ జట్టు అంచనా:

స్టిర్లింగ్‌, బల్బిర్నీ, టక్కర్‌, టెక్టర్‌, కాంఫర్‌, డాక్‌రెల్‌, అడెయిర్‌, మెక్‌కార్తి, యంగ్‌, లిటిల్‌, వైట్‌/వోర్‌కామ్‌.

Also Read:మహేష్‌తో అక్కడ ప్లాన్ చేశాడు!

- Advertisement -