మహేష్‌తో అక్కడ ప్లాన్ చేశాడు!

19
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా గుంటూరు కారం రాబోతుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా ఐదు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం ఆరో షెడ్యూల్ షూటింగ్ కి లొకేషన్ ను ఫైనల్ చేసుకుంది. ఈ ఆరో షెడ్యూల్ ను అమృత్‌ స‌ర్‌ లో వచ్చే నెల 5వ తేదీ నుంచి స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. అమృత్‌ స‌ర్‌ లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌ లో మహేష్ బాబు – శ్రీలీల పై కొన్ని లవ్ సీన్స్‌ ను చిత్రీకరించనున్నారు. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ బాబు బిజినెస్ మెన్ గా కనిపించనున్నాడు.

మహేష్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. నిజానికి ఈ షెడ్యూల్ గత నెల నుంచే రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ కావాలి. అయితే, అప్పుడు మహేష్ బాబు వెకేషన్ లో ఉండటంతో తప్పక షూటింగ్ పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత ఈ నెలలో ప్లాన్ చేశారు. మళ్ళీ మహేష్ వెకేషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే.. మళ్ళీ పోస్ట్ ఫోన్ చేశారు. ఎట్టకేలకు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి షూట్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే గొప్ప హిట్ సినిమాలను తీస్తూ.. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. అయితే, గుంటూరు కారం సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు.

Also Read:ఆలు పాలతో ఎన్ని ఉపయోగాలో..!

వాస్తవానికి పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాల్సిన టాలెంట్ త్రివిక్రమ్ కి ఎప్పుడో ఉంది. అంత అద్భుతమైన రచయిత ఆయన. అందుకే, గుంటూరు కారం సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. అన్నట్టు ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయట. అందుకే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:మెగాస్టార్ కి ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే ?

- Advertisement -