పాకిస్తాన్పై ఆసియా కప్ ఫైనల్లో విజయం సాధించి నెల రోజుల తర్వాత, భారత టీ20 జట్టు మళ్లీ యాక్షన్లోకి దిగుతోంది. మొదటి టీ20 మ్యాచ్ అక్టోబర్ 29, బుధవారం, క్యాన్బెరాలోని మనుకా ఓవల్ మైదానంలో జరుగుతుంది. గత రెండేళ్లుగా భారత జట్టు టీ20 ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆసియా కప్లో భారత్ పెద్దగా సవాళ్లను ఎదుర్కోలేదు, కానీ ఆస్ట్రేలియా పర్యటన మాత్రం అంత ఈజీగా ఉండబోదు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో ఒకటి కానుంది. అలాగే సరైన ప్లేయింగ్ XI ఎంపిక చేయడం కూడా జట్టు మేనేజ్మెంట్కి సులభం కాదు. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్కు అందుబాటులో లేడు.
అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా రానుండగా సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) – 3వ స్థానంలో,తిలక్ వర్మ – 4వ స్థానంలో,సంజు సామ్సన్ (వికెట్ కీపర్) – 5వ స్థానంలో ఆడనున్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ఆసియా కప్లో అద్భుత ఫామ్లో ఉన్నాడు.17 వికెట్లు తీసి టోర్నమెంట్లో టాప్ బౌలర్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఆయన బెంచ్పైనే ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆయనను జస్ప్రీత్ బుమ్రాతో కలిపి ప్రధాన బౌలర్గా జట్టు చేర్చే అవకాశం ఉంది. తుది జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
భారత్ జట్టు అంచనా:
అభిషేక్ శర్మ,శుభ్మన్ గిల్,సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్),తిలక్ వర్మ,సంజు సామ్సన్ (వికెట్ కీపర్),శివమ్ దూబే,అక్షర్ పటేల్,నితీష్ కుమార్ రెడ్డి / అర్ష్దీప్ సింగ్,జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి,కుల్దీప్ యాదవ్.
Also Read:కాకినాడ పోర్టు..గ్రేట్ డేంజర్ సిగ్నల్

