తెలంగాణ‌లో కేసీఆర్ కే మా మ‌ద్ద‌తుః జీవీఎల్

252
gvl kcr
- Advertisement -

తెలంగాణ‌లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి బీజేపీ త‌ర‌పున‌ పూర్తి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు బీజేపీ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు. టీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాల‌ని మ‌హాకూట‌మి నేత‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌న్నార‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.

gvl narsimha rao

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌జ‌ల‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల అధికార పార్టీ టీఆర్ఎస్ కు క‌లిసివ‌చ్చింద‌న్నారు. కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవ‌డం తెలంగాణ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకించారని చెప్పారు. బీజేపీ మ‌రోసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -