పార్ల‌మెంట్ లో ‘భ‌ర‌త్ అనే నేను’..

272
bharath ane nenu
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈచిత్రిన్ని ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వినిద‌త్ లు నిర్మిస్తున్నారు. మ‌హేశ్ బాబు స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా హెగ్దె న‌టిస్తుంది. ప్ర‌ముఖ కామెడీ హీరో అల్ల‌రి న‌రేష్ ఈసినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేశ్ బాబు న‌టించి ఇటివ‌లే విడుద‌లైన సినిమా భ‌ర‌త్ అనే నేను . 

bharath ane nenu

ఈమూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈమూవీలో మ‌హేశ్ బాబు ముఖ్య‌మంత్రిగా న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌హేశ్ బాబు కెరీర్ లో నే ఈచిత్రం భారీ వ‌సూళ్లను రాబ‌ట్టింది. అయితే తాజాగా మ‌హేశ్ బాబు న‌టించిన సినిమా గురించి పార్ల‌మెంట్ లో చెప్పారు గుంటూరు ఎంపీ, మ‌హేశ్ బాబు బావ గ‌ల్లా జ‌య‌దేవ్.

తెలుగులో విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను సినిమాలో రాష్ట్రానికి జ‌ర‌గుతున్న అన్యాయ‌న్ని చక్క‌గా చూపించార‌న్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే మ‌హేశ్ బాబు పేరు మొత్తానికి ఢిల్లీ వేదిక‌గా పార్ల‌మెంట్ లో వినిపించాడు మ‌హేశ్ బాబు బావ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్.మ‌హేశ్ బాబు న‌టించిన సినిమా పేరు పార్ల‌మెంట్ వేదిక‌గా ఎంపీ ప్రస్తావించ‌డంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు సూప‌ర్ స్టార్ అభిమానులు.

- Advertisement -