HarishRao:రాష్ట్రంలో ద్విముఖ వ్యూహం అమలు

27
- Advertisement -

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతో దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు. వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర సచివాలయం నుండి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేత మహంతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసకుంటున్న చర్యల గురించి మంత్రి వివరించారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం నేపథ్యంలో జిల్లాకు ఇద్దరు చొప్పున వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వీరి ద్వారా సబ్‌ సెంటర్ పీహెచ్‌సీ సహా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

వడగాల్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ సహా అన్ని ఆస్ప‌త్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం సహా, అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీటి వసతి ఉండేలా చూడటం జరిగిందన్నారు. వడ దెబ్బ తగిలిన పెద్దలు, చిన్నారులకు చికిత్స అందించేలా సంసిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రత్యేకంగా వార్డులు, ఐసియూ బెడ్స్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Also Read: తెలంగాణ..ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీక

108 అంబులెన్సు అందుబాటులో ఉంచి, తక్షణం వైద్య సహాయం అందేలా అంబులెన్స్‌లో అవసరమైన మందులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ సకాలంలో అప్రమత్తం చేయడం వల్ల అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం మరింత వేగవంతం అవుతుందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్బంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Also Read: హైదరాబాద్‌లోకి లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌

- Advertisement -