సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా:జలగం

48
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెలిపారు బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు. కొత్తగూడెం ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించిన హైకోర్టు…కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కోర్టు ఉత్తర్వులను కార్యదర్శికి అందజేశారు. అనంతరం మాట్లాడిన జలగం…2018 ఎన్నికల్లో అనేక కుట్రలు జరిగిన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చానని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం‌కు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని, ఆ మేరకు ముందుకు సాగుతానని చెప్పారు.

Also Read:ఎంపీ అరవింద్‌ పై బీజేపీ నేతల ఫైర్..

వనమా వెంకటేశ్వరరావుపై 2019లో హై‌కోర్టులో పిటిషన్ వేశానని, వాదనలు విన్న కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చిందని జలగం అన్నారు. నన్ను ఎమ్మెల్యేగా కోర్టు పరిగణించిందని, వనమా వెంకటేశ్వరరావును డిస్‌క్యాలిఫై చేసిందని …. నాది నైతిక విజయం అన్నారు.

Also Read:మోడీ సర్కార్‌పై అవిశ్వాసం..అనుమతిచ్చిన స్పీకర్

- Advertisement -