ప్రతీ ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం: ఎన్‌వీఎస్‌ రెడ్డి

178
nvs reddy
- Advertisement -

అన్ లాక్ 4 కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు హైదరాబాద్ మెట్రో రైల్ ఎం డి.. ఎన్ వీ ఎస్ రెడ్డి.అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం……ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి అని…మార్కింగ్ కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నారు.

నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తాం….నగదు రహిత రూపంలో ఆన్ లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలిన్నారు. ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుందని….రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.

ఫేస్ మాస్క్ తప్పనిసరి…. లేనివారు స్టేషన్ లో కొనుక్కోవాలన్నారు.ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం…..నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతి హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్ తో రావాలి ….75% ఫ్రెష్ ఎయిర్ ట్రైన్ లో అందుబాటులో ఉంటుందన్నారు.అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము…ప్రతి స్టేషన్ లో ఐసోలేషన్ రూంలు ఏర్పాటుచేశామన్నారు.

- Advertisement -