దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్ధ నెం1 స్ధానంలో ఉందిః హోమంత్రి

256
Rachakonda Police Comissioner
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని వాయుపూరిలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రాచకొండ పోలీస్ కమిషనరేట్ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహమ్మద్ అలీ గారు మరియు రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కరి చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు ఈ భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేసినందుకు పోలీస్ హౌసింగ్ చైర్మన్ దామోదర్ అభినందించారు.

Rachakonda Police Comissioner

ఈ సందర్భంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పోలీసుల పెద్దపీట వేస్తుందని అన్నారు; రాష్ట్రంలో శాంతిభద్రతలు సమస్య తలెత్తకుండా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందన్నారు; దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పోలీస్ వ్యవస్థ నెంబర్ వన్ గా నిలిచింది అన్నారు; ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉందన్నారు; ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి; రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్; సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్; మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు; రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు పలువురు శాసనసభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -