తొలిసారి..వాట్సాప్ ద్వారా కేసు విచారణ!

63
hc
- Advertisement -

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. వాట్సాప్ ద్వారా కేసును విచారించారు ఓ హైకోర్టు న్యాయమూర్తి. అది కూడా ఆదివారం సెలవు రోజు కేసు విచారణ జరిగింది.తమిళనాడులో ధర్మపురి జిల్లాలో అభీష్ట వరదరాజస్వామి రథయాత్ర జరిగింది. అర్ధరాత్రి జరిగిన వేడుకల్లో రథానికి విద్యుత్‌ తీగలు తగిలి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.

దీంతో స్వామి వారి దేవాలయం అనువంశిక ధర్మకర్త పీఆర్‌ శ్రీనివాసన్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని కోరారు. ఇక ఆదివారం ఓ వివాహ వేడుకలో పాల్గొన్న జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ వాట్సాప్‌లోనే విచారణ చేపట్టారు. ఇరువర్గాల వారు వాట్సాప్‌లోనే వాదనలు వినిపించగా రథయాత్రను నిలిపేసేందుకు ఇన్​స్పెక్టర్ ఆదేశాలివ్వలేరని తెలిపారు న్యాయమూర్తి. రథయాత్ర జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాను నిలిపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -