అశ్విన్ బాబు..’హిడింబ’ సెన్సార్ పూర్తి

31
- Advertisement -

సినిమాని సర్టిఫై చేయడానికి సెన్సార్ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడానికి రకరకాల కారణాలు వుంటాయి. ‘హిడింబ’ సినిమా విషయానికి వస్తే మొదట సెన్సార్ అధికారుల నుంచి క్లియరెన్స్ పొందింది, ఐతే కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు భావించారు. తర్వాత రివ్యూ కమిటీ ద్వారా సినిమా రీ-సెన్సార్ చేసి ఆమోదం పొందింది.

‘హిడింబ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సినిమాను ప్రమోట్ చేయనున్నారు మేకర్స్‌. “ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ & ఇంతకు ముందేవరూ టచ్ చేయని జానర్‌ “అని రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఉంది. నిజానికి, థియేట్రికల్ ట్రైలర్ కూడా అదే సూచించింది. యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని థ్రిల్ ని ఇచ్చే విధంగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు అనీల్ కన్నెగంటి.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో ప్రకృతి ప్రేమికులు..

AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పణలో OAK ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. నందితా శ్వేత, అశ్విన్ కి జోడి గా నటిస్తున్నారు.

బి రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ కాగా, వికాస్ బాడిసా సంగీతం సమకూరుస్తున్నారు.తారాగణం: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేక సుదాకర్, ప్రమోధిని

Also Read:టుడే టాలీవుడ్ వైరల్ కంటెంట్ 

- Advertisement -