ఐశ్వర్య రెండో పెళ్లి ఆ హీరోతోనే !

67
- Advertisement -

తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రఘువరన్ బీటెక్’ చిత్రంలో ధనుష్ సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యశాఖ సహాయక నిర్వాహకులు చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారణ జరిపిన కోర్టు సరైన ఆధారాలు లేవని పిటిషన్ కొట్టివేసింది. దీంతో ధనుష్‌ కు – ఐశ్వర్య రజనీకాంత్‌ కు ఊరట లభించినట్టు అయింది. మరోవైపు ఐశ్వర్య రజనీకాంత్‌ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

ధనుష్ తో విడిపోయాక ఐశ్వర్య రజనీకాంత్‌ ఒంటరిగా ఉంటున్నారు. ఐతే, గత కొన్ని నెలలుగా ఆమెతో హీరో శింబు సన్నిహితంగా ఉంటున్నాడని.. అందుకే, ఐశ్వర్య రజనీకాంత్‌ ధనుష్ కి పూర్తిగా దూరం అయ్యింది అని టాక్. పైగా శింబుతో ఐశ్వర్య రజనీకాంత్‌ పెళ్ళికి కూడా రెడీ అవుతుందని.. అలాగే శింబుతో మళ్లీ పిల్లలను కనాలని ఐశ్వర్య రజనీకాంత్‌ నిర్ణయించుకుందట. అందుకే, ధనుష్ తో కలిగిన పిల్లల విషయంలో కూడా సగం బాధ్యతను ధనుష్ కి అప్పజెప్పింది అని తెలుస్తోంది.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో ప్రకృతి ప్రేమికులు..

మొత్తానికి ఐశ్వర్య రజనీకాంత్‌ తన తండ్రికి కూడా తానూ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపిందట. సరైన సమయంలో తన రెండో పెళ్లి విషయాన్ని మీడియాకి కూడా చెప్పాలని ఐశ్వర్య రజనీకాంత్‌ ప్లాన్ చేసుకుంటుంది. ఇక అటు శింబు కూడా ఐశ్వర్య రజనీకాంత్‌ ని రెండో పెళ్లి చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాడట. ప్రస్తుతం శింబు, ఐశ్వర్య రజనీకాంత్‌ తో కలిసి ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది.

- Advertisement -