గ్రీన్ ఛాలెంజ్ .. మొక్కలు నాటిన హీరో దినేష్

258
chalenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరోయిన్ ప్రియాంక శర్మ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కు లో మొక్కలు నాటారు హీరో దినేష్ (హుషారు).
.

ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు ఈ చాలెంజ్ తో అయినా అందరూ ముందుకు వచ్చి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

మన భవిష్యత్ తరాలకు అందించేది ఈ ప్రకృతి ఒకటేనని ప్రకృతి మంచిగా ఉంటే మనందరం బాగుంటావము అని తెలిపారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురు ప్లే బ్యాక్ సినిమా టీం అనన్య నాగళ్ళ; జక్క హరిప్రసాద్; స్పందన లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -