బీజేపీ రాంమాధవ్‌కు వేణుగోపాలాచారి కౌంటర్

432
venugopala chary
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి. తెలంగాణాలో అమలవుతున్న పథకాలన్నీ దేశానికి ఆదర్శం అనీ, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీ గతంలో చెప్పలేదా?అని ప్రశ్నించారు.

బీజేపీ హయాంలో జరిగిన స్కాంల్లో ప్రధాన నిందితులు విదేశాలకు పారిపోవడానికి పరోక్షంగా తోడ్పడింది ఎవరన్నారు.నిజంగా బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు? అని ప్రశ్నించారు.

కరోనా కట్టడిలో కేంద్రానికి అన్ని రకాల సహకారం అందిస్తున్న తెలంగాణా ప్రభుత్వంపై కువిమర్శలు చేస్తున్నది బీజేపీ కాదా?అని దుయ్యబట్టారు. దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయలేకనే, ఇవాళ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నాయకులు పబ్బం గడుపుకోవడం వాస్తవం కాదా అని చురకలంటించారు.

- Advertisement -