- Advertisement -
తెలంగాణలోని పలు జిల్లాలో వేసవి తాపం పెరిగిపోతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ భానుడి ప్రతాపం చూసిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉంటుండగా, తోపుడు బండ్ల వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
గత వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలిలో తేమ 24 శాతంగా రికార్డయింది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
- Advertisement -