Harishrao:రైతులపై కాంగ్రెస్‌కు ప్రేమలేదు

49
- Advertisement -

రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ మరోసారి చాటుకుందన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాన భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌.. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదు అన్నారు. 75వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా అందించిందని… గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే… కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారన్నారు.

కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిన ప్రజలు ఓట్లు వేయరని.. 69లక్షల రైతులు కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారన్నారు. పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోందని… రైతుల జోలికి వస్తే కబర్ధార్ అని హెచ్చరిస్తున్నా అన్నారు. డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరిస్తున్నామని… కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు అన్నారు.

కర్ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్ లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారని… కర్ణాటక లో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు అన్నారు. కేసీఆర్ పాలనలో నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నాం అని… రైతుల పై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందన్నారు. రైతుబంద్ పొందిన 69లక్షల రైతులు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడతారని… కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బందు కేసీఆర్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారిందని ఆరోపించారు.

Also Read:RGV:తలకోన..పెద్ద విజయం సాధించాలి

- Advertisement -