ఇంటి పరిసరాల శుభ్రతతో వ్యాధులు పరార్‌..

54
- Advertisement -

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు దోమల నివారణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోకాపేట్ లోని తన నివాసంలో 10 నిముషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీరును స్వయంగా తొలగించి చెత్తను మంత్రి హరీష్ రావు శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా మన ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.

పూల కుండీలు, కొబ్బరి చిప్పలు వంటి చోట్ల నిలువ ఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు.ఆరోగ్యం విషయంలో ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు.

Also Read:ఆడవాళ్ళని నగ్నంగా తిప్పుతారా?:దాసోజు

మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు అలర్ట్ గా ఉండాలి. పరిశుభ్రమైన పరిసరాలతో పాటు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల సాధ్యమైనంత మేరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జీహెచ్ఏంసీ, గ్రామ పంచాయితీల్లోని సిబ్బంది వీధులను శుభ్రం చేస్తున్నా.. మన ఇంటి పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్దంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు చేస్తోంది. అదేవిధంగా మందులతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశాం. కాబట్టి అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాల్సిందిగా మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

Also Read:బాక్సాఫీస్ వార్..లియో వర్సెస్ భగవంత్ కేసరి!

- Advertisement -