Ind Vs WI:పట్టుబిగించిన భారత్

42
- Advertisement -

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. భారత బౌలర్ల ధాటికి మూడో రోజు ఆటముగిసే సమయానికి విండీస్ 5 వికెట్లు కొల్పోయి 229 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్‌ (75), టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ (33), మెకంజీ (32) పరుగులు చేయగా ప్ర‌స్తుతం క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్‌ (37) ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 209 పరుగుల వెనుక‌బ‌డి ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయ‌గా మహ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్‌ కుమార్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

Also Read:ఫోన్‌లో యాప్స్ ఆన్ ఇన్స్టాల్ చేస్తే ఇలా చేయండి!

అంత‌కుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 86/1తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్టిండీస్‌ నెమ్మదిగా ఆడింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్ కుమార్‌ తన తొలి వికెట్ తీశారు. వరుణుడు కాసేపు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు.

Also Read:ఆడవాళ్ళని నగ్నంగా తిప్పుతారా?:దాసోజు

- Advertisement -