మంత్రి ఉత్తమ్‌కి హరీష్‌ రావు లేఖ

0
- Advertisement -

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు హరీష్ రావు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలని, దానికోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు ఎల్‌నినో వల్ల తక్కువ వర్షపాతం, మరోవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు ఆందోళనలో ఉన్నారు… వానాకాలం పంట సాగుకు సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 6.9 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది అన్నారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి SRSP STAGE-2లోని ఆయకట్టుకు నీరు అందించి రైతులను ఆదుకోవాలి.. గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగైన విషయం గుర్తించి, ఈ వానాకాలం పంటకు, అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు హరీష్ రావు.

- Advertisement -