నువ్వే గట్లంటే కేసీఆర్ ఎంత బలవంతుడు..

198
- Advertisement -

ప్రత్యర్థుల తిట్లే తనకు బలమంటున్న మోదీ…సీఎం కేసీఆర్ ను బీజేపీ నేతలు టన్నుల కొద్దీ తిట్లు సీఎంకు ఎంత బలవంతుడిని చేసుంటాయని ట్వీట్టర్ ద్వారా నిలదీశారు. తెలంగాణకు వచ్చి ఉత్త మాటలు మాట్లాడిపోయిన నీవు దేశానికి తెలంగాణకు ఏం చేశావని అని ప్రశ్నించారు. కుంటి సాకులు చెప్పి పలాయన పల్లవి ఎత్తుకోవడం ఎంతవరకు భావ్యమని మంత్రి హరీశ్‌ రావు మోదీని నిలదీశారు.

‘ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అంటున్నారు.. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోదీ జీ.. దేశానికీ, తెలంగాణకు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోదీ జీ..’ అని మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి..

దేశ రాజధానిలో భూకంపం

వినతుల ఊసెత్తని ప్రధాని..

విద్యాశాఖలో కొలువుల జాతర

- Advertisement -