మొక్కలు నాటిన నటుడు (విలన్) హరిష్ ఉత్తమన్

180
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కోనసాగుతుంది. దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు శత్రువు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ నటుడు విలన్ హరిష్ ఉత్తమన్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానని ఎవరి పుట్టినరోజు అయినా కూడా తప్పకుండా ఆ పుట్టినరోజు గుర్తుగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని చెపుతాను అని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు దూసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా నటుడు చరణ్; కమెడియన్ లు సత్యం రాజేష్; మధునందన్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -